24 గంటల్లో ఇండియాలో 25,404 కరోనా కేసులు: కేరళలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి

By narsimha lodeFirst Published Sep 14, 2021, 9:37 AM IST
Highlights

ఇండియాలో గత 24 గంటల్లో  25,404 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 3,32,89,579 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఇండియాలో ఇప్పటివరకు కరోనా నుండి 3,24,84,159 మంది కోలుకొన్నారు.


న్యూఢిల్లీ: గత 24 గంటల్లో ఇండియాలో  25,404 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో నిన్న ఒక్క రోజే  339 మంది మృతి చెందారు.గత 24 గంటల్లో కరోనా నుండి 37,127 మంది కోలుకొన్నారు. ఇండియాలో ప్రస్తుతం దేశంలో 3,62,207 లక్షల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 3,32,89,579 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఇండియాలో ఇప్పటివరకు కరోనా నుండి 3,24,84,159 మంది కోలుకొన్నారు. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,43,213కి చేరుకొంది. 

దేశంలో ఇప్పటివరకు 54,44,44,967 మంది నుండి శాంపిల్స్ సేకరించినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇండియాలో ఇప్పటివరకు 75.22 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అందించారు.మరో వైపు కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతుంది. నిన్న ఒక్క రోజే 15,058 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 99 మంది చనిపోయారని ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనివే కావడం గమనార్హం.
 

click me!