భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ గుత్తా జ్వాలపై కొందరు అల్లరి మూక దాడి చేసింది. జ్వాల కూడా వారికి తగిన బుద్ది చెప్పింది. అల్లరి మూక ఆటకట్టించింది. వారి కామెంట్లకు ఆమె కూడా అదే స్థాయిలో స్పందించింది.
గుత్తా జ్వాల తల్లిదండ్రులలో తండ్రిది భారతదేశం. తల్లిది చైనా, గుత్తా కూడా టియాన్ జిన్ లో జన్మించారు. ఈ నేపథ్యంలో... కొందరు ఆకతాయిలు గుత్తా జ్వాలపై విమర్శలు గుప్పించారు. ఇండియాకు సంబంధించిన విషయంలో ఒక డిబెట్ సోషల్ మీడియాలో జరిగింది. అందులో గుత్తా కూడా పాల్గొంది. తను చేసిన కామెంట్లకు ఆమెను భారత దేశద్రోహిగా అభివర్ణించారు. మీ అమ్మది చైనా కావడంతోనే నీవు ప్రతిసారి మోదీని వ్యతిరేకిస్తున్నావా...? అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు.
దీనికి గుత్తా కూడా దీటుగా సమాధానం చెప్పింది తన తల్లిదండ్రులను ఇందులోకి లాగితే తనలో ఉన్న మరో కోణాన్ని చూడాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. ఏదైనా మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పింది.
మరో నెటిజన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అంశాన్ని మరో నెటిజన్ లేవనెత్తాడు. దీంతో ఆ వ్యక్తిపై జ్వాల విరుచుకుపడింది. దమ్ముంటే తను ముందుకు వచ్చి మాట్లాడాలంటూ సవాల్ విసిరింది. ట్విట్టర్లో జ్వాల తన పై కామెంట్లు చేసిన వ్యక్తుల పై సరైనా సమాధానం చెప్పిందని యూజర్లు అన్నారు.