జయశంకర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published : Mar 11, 2018, 05:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
జయశంకర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సారాంశం

భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం దంపతుల మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనం కోసం వెళ్లివస్తున్న ఓ కుటుంబం కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దంపతులు మృతిచెందారు.  మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి కారులో మంగపేట మండలం మల్లూరు దేవస్థానానికి దైవదర్శనం కోసం వెళ్లారు. అక్కడ కుటుంబం మొత్తం ఆనందంగా గడిపి తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో  భూపాలపల్లి జిల్లాలోని హైదరాబాద్-భూపాలపట్నం రహదారిపై తాడ్వాయి మండల కేంద్రం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన వున్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీట్లలో కూర్చున్న దంపతులు మృతిచెందగా వెనకాల కూర్చున్న కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)