అంబానీ ఈవెంట్ లో సుధామూర్తి చాలా స్పెషల్... ఎందుకో తెలుసా..?

First Published Jul 17, 2024, 3:00 PM IST

వాళ్లు తమ లుక్ కోసం అంత కష్టపడి, అంత ఖర్చు పెట్టినా... ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తి మాత్రం చాలా స్పెషల్ గా నిలిచారు.

భారతదేశంలో అత్యంత సంపన్నుడైన వ్యాపారవేత్త ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అనంత్- రాధికల వివాహం కళ్లారా చూడటానికి, నూతన వధూవరులను ఆశీర్వదించడానికి దేశంలోని చాలా మంది సెలబ్రెటీలు వెళ్లారు. టాలీవుడ్, బాలీవుడ్, రాజకీయ, వ్యాపార, క్రికెట్ ప్రముఖులంతా వెళ్లి సందడి చేశారు.
 

చాలా మంది సెలబ్రెటీలు.... ఈ అంబానీ ఇంట పెళ్లి కోసం చాలా స్పెషల్ గా రెడీ అయ్యారు.  లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ.. స్పెషల్ గా డ్రెస్ లు డిజైన్ చేయించుకున్నారు. ఎవరికి వారు భిన్నంగా కనిపించేందుకు.. స్పెషల్ జ్యువెలరీ కూడా డిజైన్ చేయించుకున్నారు. అయితే.. వాళ్లు తమ లుక్ కోసం అంత కష్టపడి, అంత ఖర్చు పెట్టినా... ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తి మాత్రం చాలా స్పెషల్ గా నిలిచారు.
 

Latest Videos


ఆమె అంత స్పెషల్ గా నిలవడానికి కారణం ఆమె సింప్లిసిటీనే.  ఒక్కొక్కరు అంత లగ్జరీ దుస్తులు, జ్యువెలరీతో దర్శనమిస్తే.. సుధామూర్తి మాత్రం... చాలా సింపుల్ గా ఈ పెళ్లికి వచ్చారు. ఎలాంటి హడావిడీ లేకుండా.. నార్మల్ పట్టుచీర.. మెడలో సింపుల్ గా నల్లపూసల దండతో ఆమె  ఈ ఈవెంట్ కే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆమె సింప్లిసిటీకి... నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
 

సుధామూర్తి ఈ పెళ్లికి.. పింక్ కలర్ పట్టుచీర కట్టుకున్నారు. మెడల్ కేవలం ఒక మంగళసూత్రం మాత్రమే ఉంది. వేరే ఏ ఇతర ఆభరణాలు, ఆఢంబరాలు లేకపోవడం గమనార్హం. చేతికి ఒక వాచ్ ఉంది అంతే. మనం ఎక్కడికి వెళ్లినా.. మనం మనలా ఉండటం  అంటే ఇదే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సుధామూర్తి దగ్గర డబ్బులు లేక..ఆమె అంత సింపుల్ గా రాలేదు.. ఆమె కూడా ఒక బిలీనియర్. అయినప్పటికీ.. అంత సింపుల్ గా.. సామాన్యురాలిగా అంబానీ ఇంట ఈవెంట్ కి రావడం అందరి మనసులు గెలుచుకున్నారు. 

click me!