కొత్త కారు కొన్న ముకేష్ అంబానీ భార్య నీతా.. ధర ఎంతో తెలుసా?

First Published Apr 9, 2024, 3:06 PM IST

నీతా అంబానీ స్పెషల్ గా కస్టమైజ్డ్ చేయించుకొని మరీ ఈ కారు కొన్నారు. రోల్స్ రాయిస్ కంపెనీని కొనుగోలు చేయగా.. ఆ కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
 

మన దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీకి పరిచయం అవసరం లేదు.  ఆయన ఏది చేసినా సంచలనమే. ముకేష్ అంబానీకి సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముకేష్ కి సంబంధించిన మాత్రమే కాదు.... ఆయన భార్య నీతా లైఫ్ స్టైల్ ఆమె వాడే జ్యూవెలరీ, శారీలకు సంబంధించిన వార్తలు కూడా వస్తూ ఉంటాయి.  తాజాగా... నీతా అంబానీ ఓ కారు కొన్నారు.

నీతా అంబానీ స్పెషల్ గా కస్టమైజ్డ్ చేయించుకొని మరీ ఈ కారు కొన్నారు. రోల్స్ రాయిస్ కంపెనీని కొనుగోలు చేయగా.. ఆ కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
 

ఇప్పటికే అంబానీ  ఇంటి గ్యారేజీలో 168కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్త పింక్ రోల్స్ రాయిస్  కూడా వచ్చి చేరింది.  దాని రంగు, అందం  అనేక ఫీచర్ల కారణంగా వాటిలో ప్రత్యేకంగా నిలుస్తుంది.
 

అవును, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కొత్త రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWBని కొనుగోలు చేశారు. ఇది రోజ్ క్వార్ట్జ్ రంగు. బహుశా ఈ రంగులో రోల్స్ రాయిస్‌ను కలిగి ఉన్న ఏకైక ఇండియన్ నీతా కావడం విశేషం. 

దాదాపు 12 కోట్ల ధర కలిగిన ఈ కారులో రోజ్ క్వార్ట్జ్ ఎక్ట్సీరియర్, ఆర్కిడ్ వెల్వెట్ ఇంటీరియర్ ప్రత్యేకత. గత దీపావళికి, ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీకి రూ. 10 కోట్ల రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చారు. 

ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన SUV. ఇప్పుడు నీతా కొన్న కారు విలువ దానికంటే మరో  రెండు కోట్లు ఎక్కువ. అంటే అక్షరాలా రూ.12కోట్లు. 

సాధారణంగా ఇలాంటి ఖరీదైన కార్లను కొనుగోలు చేసే వారు నలుపు లేదా తెలుపు రంగులను ఎంచుకుంటారు. అయితే, రోల్స్ రాయిస్‌తో, మీరు ఎక్ట్సీరియర్ ,ఇంటీరియర్‌ని కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంది.

ఈ కస్టమైజేషన్ ఆధారంగా కారు ధర కూడా పెరుగుతుంది. ఉదాహరణకు, స్టాండర్డ్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB ధర రూ. 12 కోట్లు. నీతా అంబానీ కస్టమైజేషన్ కోసం ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

click me!