గోధుమలు, బియ్యం బస్తాలో ఉప్పు వేస్తే ఏమౌతుంది?
బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలను నిల్వ చేసే సంచుల్లో ఉప్పును ఎప్పుడైనా కలిపారా? ఇలా చాలా తక్కువ మంది చేస్తారు. కానీ ఇది బియ్యానికి, గోధుమలకు పురుగులు పట్టకుండా చేసే చాలా పాత పద్దతి. ఉప్పుతో పురుగులు పట్టవా అని డౌట్ రావొచ్చు. కానీ పట్టవు. ఎందుకంటే ఉప్పులో సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఈ వాసన వల్ల పురుగులు, కీటకాలు ధాన్యాల నుంచి పారిపోతాయి.