చిటికెడు పసుపు, మూడు టేబుల్ స్పూన్ల శనగ పిండి, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ , కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ రూపంలో తయారు చేసుకోవాలి. తర్వాత దానిని ముఖం , మెడపై రాయండి. పదిహేను నిమిషాల తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది.