రెండు రకాల గాజులు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. గాజులు ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. ఆకుపచ్చ గాజులను సాధారణంగా దక్షిణ భారత రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో ఎక్కువగా ధరిస్తారు. పంజాబ్, యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎరుపు రంగును విరివిగా వాడుతారు. ఆకుపచ్చ సాధారణంగా ఆధ్యాత్మికత, శాంతిని సూచిస్తుంది.