ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా వెల్లడించింది. గర్భాశయం లోపలి పొరను పోలిన పొర మరొకటి.. లోపల పెరగడం వల్ల.. ఈ ఎండోమెట్రియాసిస్ అనే సమస్య మొదలౌతుందట. ఇది ఒక్కసారి వచ్చింది అంటే ఇక తగ్గడం అనేది ఉండదు.
ఈ సమస్య వచ్చిన వారికి గర్భాశయంలో వాపు రావడం, మచ్చలాగా ఏర్పడుతుందట. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వస్తుందట. ఈ సమస్య వచ్చినవారికి.. పీరియడ్స్ సమయంలో, కలయిక సమయంలో, మూత్ర విసర్జన చేస్తున్న సమయంలోనూ.. విపరీతంగా నొప్పి వస్తుందట. నిత్యం కడుపు ఉబ్బరం, వికారం, అలసట, డిప్రెషన, యాంగ్జైటీ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అక్కడితో ఆగలేదు... మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. అంటే... ఈ సమస్య వచ్చిన వారికి పిల్లలు పుట్టడం కూడా కష్టమే. గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.