రైల్లో నిషేధిత వస్తువులు
ఇండియన్ రైల్వేస్ రూల్స్ ప్రకారం స్టౌస్టవ్లు, గ్యాస్ సిలిండర్లు, మండే రసాయనాలు, బాణసంచా, యాసిడ్స్, జంతు చర్మాలు, గ్రీజు, సిగరెట్లు, పేలుడు పదార్థాలను రైళ్లలో తీసుకెళ్లకూడదు. రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణీకులెవ్వరూ మద్యం తాగి లేదా మత్తు పదార్థాలు తీసుకొని రైలులో ప్రయాణించకూడదు.