కడుపునొప్పని భర్తకు చెప్పి.. అల్లుడితో లాడ్జిలో గడిపిన అత్త.. చివరికి ఏం జరిగిందంటే..

Published : Apr 18, 2023, 11:56 AM IST

ఓ మహిళ వరుసకు అల్లుడయ్యే వ్యక్తితో లాడ్జికి వెళ్లింది. అక్కడ రాత్రి గడిపిన తరువాత ఆమె ఆత్హహత్య చేసుకుంది. అయితే అది హత్య అని పోలీసులకు ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 

PREV
15
కడుపునొప్పని భర్తకు చెప్పి.. అల్లుడితో లాడ్జిలో గడిపిన అత్త.. చివరికి ఏం జరిగిందంటే..

భద్రాచలం : తెలంగాణలోని భద్రాచలంలో ఓ మహిళ అనుమానాస్పద మృతి విషయంలో ఆమెకు అల్లుడి వరస అయ్యే వ్యక్తి మీద కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆదివారం పట్టణంలోని ఓ లాడ్జిలో రావూరి అరుణ (35)  అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా ఆమెను హత్య చేసినట్లుగా అరుణ కుటుంబ సభ్యులు సోమవారం నాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

25

అరుణకు అల్లుడు వరస అయ్యే ఆంజనేయులు ఈ హత్య చేసినట్లు వారు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన కథనం ఈ విధంగా ఉంది…రావూరి అరుణ ఆమె భర్త కృష్ణారావుతో కలిసి హైదరాబాదులోని ఓ కోళ్ల ఫామ్ లో కూలీ పనులు చేసుకుంటోంది. అరుణ తనకు కడుపులో నొప్పి వస్తుందని ఈనెల 14వ తేదీన తన సొంత గ్రామమైన తిరువూరుకు బయలుదేరింది. 

35

అక్కడ వైద్యులకు చూపించుకుని వస్తానని చెప్పింది. అలా హైదరాబాదు నుంచి బయలుదేరిన ఆమె సొంతూరుకు వెళ్లకుండా భద్రాచలం వెళ్ళింది. ఖమ్మం జిల్లాలోని కప్పలబంధం గ్రామానికి చెందిన ఆంజనేయులుతో భద్రాచలంలోని ఒక లాడ్జిలో గది తీసుకుంది. ఆంజనేయులు అరుణ భర్త కృష్ణార్జునరావుకు మేనల్లుడు అవుతాడు. అలా అల్లుడి వరస అయ్యే వ్యక్తితో ఆ రోజంతా ఆ గదిలోనే గడిపింది. 

45

ఆ తర్వాత ఈ విషయం బయటికి తెలిస్తే తన పరువు పోతుందని భయపడి లాడ్జి గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఈ మేరకు లాడ్జి నిర్వాహకులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసులు అరుణ కుటుంబ సభ్యులకు తెలిపారు. వారి హుటాహుటిన  భద్రాచలం చేరుకుని అరుణమృతదేహాన్ని పరిశీలించారు. కాగా ఆమె మెడ చుట్టూ కమిలిన గాయాలు ఉండడాన్ని గమనించారు.

55

దీన్ని బట్టి ఆంజనేయులు అరుణ మెడకి చీరను చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటాడని.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారని వారు తెలిపారు. అరుణను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను కోరారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ త్రీ నాటు కింద కేసు నమోదు చేశారు.  దీనిమీద విచారణ చేపట్టినట్లుగా సిఐ నాగరాజు రెడ్డి తెలిపారు.

click me!

Recommended Stories