భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన.. జిల్లాల్లోనూ అదే జోరు
రుతుపవనాల ముందస్తు రాక సూచనలతో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం ఐటీ హబ్ హైదరాబాద్ను వాన ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఆకస్మిక వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ట్రాఫిక్కు స్వల్ప అంతరాయం కలిగింది.
నగరంలోని మియాపూర్, షేక్పేటలలో అత్యధిక వర్షపాతం రికార్డైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్ ఏరియాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జిల్లాల విషయానికి వస్తే.. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యధిక వర్షపాతం నమోదైంది. దేవరకద్ర, మాడ్గులలలో కూడా భారీ వర్షం కురిసింది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, సంగారెడ్డి జిల్లాల్లోనూ వానలు దంచికొట్టాయి.