IMD Rain Alert : ఇక వర్షాలు షురూ.. ఏఏ రాష్ట్రాల్లో, ఎన్నిరోజులు కురుస్తాయో తెలుసా..?

Published : Feb 18, 2026, 08:00 AM IST

Weather Update : కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏఏ రాష్ట్రాల్లో, ఎప్పుడు వర్షాలు కురుస్తాయంటే.. 

PREV
15
నేటి నుండే వానలు...

IMD Rain Alert : చలికాలం ముగిసింది... ఇక ఎండల తీవ్రత పెరుగుతుందని అనుకుంటుంటే వర్షాలు మొదలయ్యాయి. భారతదేశంలో ఇవాళ్టి (ఫిబ్రవరి 18, బుధవారం) నుండి వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఈ నెలంతా వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయట.

25
బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉండనుంది... పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళలోనూ అక్కడక్కడ జల్లులు పడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణుల అంచనా.

35
ఉత్తరాది రాష్ట్రాలకు వర్షసూచన

ఉత్తరాది రాష్ట్రాలను కూడా వర్షాలు వదిలిపెట్టడంలేదు. దేశ రాజధాని డిల్లీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే పంజాబ్, హర్యానా, చండీగడ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఫిబ్రవరి 18,19 రెండ్రోజులు ఈ రాష్ట్రాల్లో వర్ష సూచనలు ఉన్నట్లు ఐఎండి ప్రకటించింది.

45
తెలంగాణలో వర్షాలు

తెలంగాణ విషయానికి వస్తే ఫిబ్రవరి 22 నుండి వర్షాలు మొదలవుతాయని... వీటికి ఉరుములు మెరుపులు, పిడుగులు తోడవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలను ఈ వర్షాలు వదిలిపెట్టవని అంటున్నారు. కొన్నచోట్ల వడగళ్ల వానలు పడే అవకాశం ఉంది... ఇవి రైతులకు పంట నష్టం కలిగించవచ్చని తెలిపారు. మొత్తంగా తెలంగాణలో ఫిబ్రవరి 22,23,24 తేదీల్లో పలుచోట్ల 20 నుండి 30 మిల్లిమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.

55
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ పై కూడా అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలుంటాయని హెచ్చరిస్తున్నారు. తమిళనాడు బార్డర్స్ లోని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలుంటాయి కాబట్టి మత్స్యకారులు, తీరప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories