TG TET 2025 Notification: తెలంగాణ టెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో 1 నుండి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా నియామకం కావాలనుకునే అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Telangana Teacher Eligibility Test - TG TET) పరీక్షను నిర్వహిస్తుంది.
TG TET 2025 Notification: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు కీలకమైన తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (తెలంగాణ టెట్ - TG TET 2025) నోటిఫికేషన్ను విడుదల చేసింది.
తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఏప్రిల్ 15 నుంచి అధికారిక వెబ్సైట్ (https://tgtet2024.aptonline.in/tgtet/) లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
తెలంగాణలో ఏడాదిలో రెండుసార్లు అంటే జూన్, డిసెంబర్ లో టెట్ పరీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగానే తెలంగాణ సర్కారు 2024 డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి 2025 జనవరిలో పరీక్షలు నిర్వహించింది. మొత్తం 2.75లక్షల మంది తెలంగాణ టెట్ కు అప్లై చేసుకోగా, 2 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు.
తెలంగాణ టెట్ అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తేదీ: ఏప్రిల్ 11, 2025
దరఖాస్తుల ప్రారంభమైన తేది: ఏప్రిల్ 11, 2025
అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ: ఏప్రిల్ 30, 2025
పరీక్ష ఎలా నిర్వహిస్తారు: కంప్యూటర్ బేస్డ్ (ఆన్లైన్)
తెలంగాణ టెట్ 2025 దరఖాస్తు ఫీజులు:
పేపర్ 1 లేదా పేపర్ 2 (ఏదైనా ఒక్కటి) ₹750
రెండు పేపర్లకు ₹1000
45
TG TET 2025 Notification Out
తెలంగాణ టెట్ 2025 పరీక్షలు ఎప్పుడు?
పరీక్ష తేదీలు: జూన్ 15 నుండి జూన్ 30 వరకు
పూర్తి వివరాలు, షెడ్యూల్: ఏప్రిల్ 15 నుండి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది
తెలంగాణ టెట్ 2025 పరీక్షల పేపర్లు ఏమిటి?
పేపర్ 1 - ప్రాథమిక పాఠశాలల (1వ తరగతి – 5వ తరగతి)కు టీచర్గా ఎంపిక కావాలనేవారికి
పేపర్ 2 - పై ప్రాథమిక పాఠశాలలు అంటే 6వ తరగతి నుంచి 8వ తరగతి టీచర్గా ఎంపిక కావాలనేవారికి సంబంధించినది. అర్హతల ప్రకారం రెండు పేపర్లు కూడా రాయవచ్చు.
తెలంగాణ టెట్ 2025 రాయడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి?
డీఎడ్ లేదా బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు తెలంగాన టెట్ 2025 రాయడానికి అర్హతను కలిగి ఉంటారు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న సర్వీస్ టీచర్లు పదోన్నతుల కోసమూ టెట్ రాయవచ్చు. డీఎస్సీ పరీక్షలు రాయాలంటే టెట్ అర్హత తప్పనిసరి కావాల్సి ఉంటుంది. డీఎస్సీ ఎంపికలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది