Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Published : Aug 26, 2026, 08:26 AM IST

Weather Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంది?

భారత వాతావరణ శాఖ (IMD) సమాచారం ప్రకారం, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు కొన్ని ప్రాంతాల్లో చురుకుగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

25
తెలంగాణ వెదర్ అప్‌డేట్.. కొన్ని జిల్లాలకు బిగ్ అలర్ట్

తెలంగాణ వాతావరణం విషయానికొస్తే, రాష్ట్రంలో చాలా చోట్ల ఉదయం సాధారణ ఎండ లేదా తేలికపాటి మేఘాలు ఉంటాయి. పగటి ఉష్ణోగ్రతలు 30°C నుండి 33°C వరకు నమోదయ్యే అవకాశం ఉండగా, రాత్రి ఉష్ణోగ్రతలు 22°C నుండి 24°C మధ్య ఉంటాయి. పశ్చిమ, ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా స్వల్పం నుంచి మోస్తరు వర్షాలు చెదురుమదురుగా మాత్రమే కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ రోజు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

అయితే, రాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

35
హైదరాబాద్‌లో సీన్ ఏంటి?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 31°C వరకు చేరుకునే అవకాశముండగా, రాత్రి పూట 24°Cకి పడిపోతాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆకాశం మేఘావృతమై, అప్పుడప్పుడు తేలికపాటి చినుకులు లేదా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని అధికారులు తెలిపారు.

45
ఆంధ్రప్రదేశ్ వాతావరణం: కోస్తా, రాయలసీమ పరిస్థితి ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో రోజంతా అప్పుడప్పుడు చినుకుల వాన పడుతూ ఉంటుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా పొడి వాతావరణం నెలకొంటుంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32°C నుండి 35°C వరకు చేరి, కాస్త వేడి పెరిగిన ఫీల్ ఇస్తాయి.

ఆగస్టు 26 నుండి 29 మధ్య కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది.

55
బంగాళాఖాతం అల్లకల్లోలం

ప్రస్తుతం అల్పపీడనం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో ఉన్నప్పటికీ, దాని ప్రభావం ఏపీ వరకు విస్తరించి పశ్చిమ దిశగా కదులుతోంది. అటు పసిఫిక్ మహాసముద్రంలో 'సాడెల్' తీవ్ర తుపాను గంటకు 140 కిలోమీటర్ల వేగంతో చైనా వైపు దూసుకెళ్తోంది. దానితో పాటు లాలా, ఇసెల్లే తుపాన్లు, మరో 7 అల్పపీడనాలు పసిఫిక్‌లో కొనసాగుతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో సముద్ర జలాలు వేడిగా ఉండడం వల్ల ఏపీ, తెలంగాణకు వెంటనే అత్యంత భారీ వర్ష సూచన లేదు. కానీ, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల జలాలు వేడిగా ఉండటంతో అల్లకల్లోలంగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories