ఏపీలో ఎండావాన :
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని... పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించారు. ఈ వర్షాలతో పాటు ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. తిరుపతిలో గరిష్టంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక నంద్యాల, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, కడప జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల తీవ్రత మరింత పెరిగి రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పెరుగుతాయని... తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.