ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు ఇలా కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇప్పటికే 48 గంటల Yellow Alert (మధ్యస్థ స్థాయి హెచ్చరిక) జారీ చేసింది. ఈ రెండు రోజుల పాటు తుఫానులు, ఈదురుగాలుల అవకాశం ఉన్న జిల్లా పేర్లను ప్రకటించింది.
ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఉన్నాయి.