ఏపీలోని ఏఏ జిల్లాల్లో వర్షాలు?
ఇవాళ (మే 1 గురువారం) శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల, బిపట్ల, కర్నూల్, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. వేసవికాలం వర్షాల సమయంలో పిడుగుపాట్లు ఎక్కువగా ఉంటాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.