ప్రతీ రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వార్త ఒకటి ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ఉండనుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మే 14వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానాలో బంకులు ఆదివారం మూతపడతాయనేది సదరు వీడియో సారాంశం.