ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న రూ. 8,000 కోట్ల విద్యార్థి ఉపకార వేతనాల బకాయిలు, బోధనా రుసుములను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను విడుదల చేసి, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
ఉచిత బస్ పాస్తో పాటు
విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించడంతోపాటు, నిర్దిష్ట ప్రభుత్వ ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే “యూత్ డిక్లరేషన్”ను ప్రకటించి యువత భవిష్యత్తును అర్థవంతంగా తీర్చిదిద్దే విధంగా పాలకులు ముందడుగు వేయాలని కోరారు.