జలవివాదం: ఏపీకి తెలంగాణ కౌంటర్, కేఆర్ఎంబీ తీరుపై కూడ అసంతృప్తి

First Published Jul 2, 2021, 11:19 AM IST

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం ఉద్రికత్తలకు దారి తీసింది. నీటి ప్రాజెక్టుల వద్ద రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించాయి.

నీటి ప్రాజెక్టుల నిర్మాణం, జల విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు పోలీస్ పహారా కొనసాగిస్తున్నాయి.
undefined
కృష్ణా నదిపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టింది.ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ విషయమై కేఆర్ఎంబీతో పాటు కేంద్ర జల్‌శక్తి మంత్రికి ఫిర్యాదు చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడ ఈ ప్రాజెక్టు పనులు చేయవద్దని ఏపీని ఆదేశించింది.
undefined
ఇదే సమయంలో ఆర్డీఎస్ కుడి కాలువ పనులను కూడ ఏపీ చేపట్టింది. ఈ పనులతో తమకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ అభిప్రాయంతో ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కూడ తెలంగాణ ఫిర్యాదు చేసింది.
undefined
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణపై కేఆర్ఎంబీకి తెలంగాణపై రెండు మార్లు ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న జల వివాదాలపై జోక్యం చేసుకోవాలని ఏ.పీ సీఎం వైఎస్ జగన్ ప్రధానికి లేఖ రాశారు.
undefined
ఏపీ ప్రభుత్వం తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ సర్కార్ కేఆర్ఎంబీకి తేల్చి చెప్పింది. పెన్నా బేసిన్ లోని ఏపీ ప్రాజెక్టుల్లో ఆ రాష్ట్ర తాగునీటి అవసరాలకు సరిపోను నీటి నిల్వలున్నాయని గురువారం నాడు తెలంగాణ స్పష్టం చేసింది.
undefined
జల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కి కేఆర్ఎంబీ లేఖ రాయడం సరైంది కాదని కూడ తెలంగాణ అభిప్రాయపడింది. కేఆర్ఎంబీ తీరుపై తమ అభ్యరంతరాన్ని వ్యక్తం చేసింది.
undefined
పెన్నా బేసిన్ లో ఏపీ ప్రభుత్వం 350 టీఎంసీల నీటిని నిల్వ చేసే ప్రాజెక్టులున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో 120 టీఎంసీల నీరు ఉందని తెలంగాణ తెలిపింది. సోమశిల, కండలేరు, వెలుగోడు రిజర్వాయర్లలో తగినన్ని నీటి నిల్వలున్నాయని తెలిపింది.
undefined
కృష్ణా ట్రిబ్యునల్ ఏపీ రాష్ట్రానికి 512 టీఎంసీలు ఏపీకి తాత్కాలికంగా కేటాయిం,చింది. అయితే తమ కేటాయింపులకు అదనంగా 250 టీఎంసీలు ఏపీ ఉపయోగిస్తోందని తెలంగాణ వాదిస్తోంది.
undefined
click me!