దాదాపు 1,25,000 మందికి పైగా లబ్దీపొందేలా 50 కోట్లతో కోచింగ్ ప్రక్రియ రూపకల్పన చేసినట్టుగా మంత్రి గంగుల వెల్లడించారు. 25వేల మందికి నేరుగా మిగతా లక్షమందికి హైబ్రిడ్ మోడ్లో శిక్షణ అందివ్వనున్నట్టుగా చెప్పారు. పేద, వెనుకబడిన వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 16 స్టడీ సర్కిళ్లు, 103 స్టడీ సెంటర్ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్టుగా చెప్పారు. ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ముందుకొచ్చి మౌళిక వసతులు సమకూరిస్తే స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.