సికింద్రాబాద్లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ సమ్మేళనానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు ఎయిర్ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, హెలికాఫ్టర్ స్ట్రీమ్లోని మూడు సర్వీసులలో సేవలందించిన సీనియర్, రిటైర్డ్ అధికారులు , రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అధికారులు హాజరవుతారు.