Telangana: డీలిమిటేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం తీర్మానం.. తమకు అన్యాయం చేయొద్దంటూ

దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చేపట్టే ఈ పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 
 

Telangana Government Opposes Delimitation Passes Resolution Against Constituency Reorganization details in telugu
Telangana Chief Minister Revanth Reddy (Pic@revanth_anumula)

తెలంగాణ అసెంబ్లీలో జనాభా ప్రాతిపదికన పునర్విభజనపై గురువారం తీర్మానం చేసింది. ఇందుకు అసెంబ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని చూస్తోందని, అయితే ఇది దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందని సీఎం అన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టింది.
 

CM Revanth Reddy

పునర్విభజనపై తెలంగాణ అసెంబ్లీ అభ్యంతరాలు ఏంటంటే.? 

జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని సీఎం రేవంత్‌ అభిప్రాయపడ్డారు. 2026 జనాభా లెక్కల తర్వాతే పునర్విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని గతంలో పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన శాపంగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

జమ్మూ కాశ్మీర్ లో రాజ్యాంగాన్ని సవరించి 2011 జనభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను 83 నుంచి 90 కి పెంచారని, సిక్కింలో 2018లో కేబినెట్ లో రిసోల్యూషన్ పాస్ చేసి ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలను ప్రజల ముందుంచేందుకే సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టినట్టు వివరించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. 


Telangana Chief Minister Revanth Reddy, Prime Minister Narendra Modi (PhotoANI)

తీర్మానంలో ఏ అంశాలను ప్రస్తావించారు.? 

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం పారదర్శకంగా వ్యవహరించాలని తీర్మానంలోపేర్కొన్నారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోతాయని, పార్లమెంట్‌లో స్థానాల సంఖ్యను యథాతథంగా ఉంచాలి, అవసరమైన మార్పులను రాష్ట్ర స్థాయిలో చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తాజా జనాభా లెక్కల ప్రకారం పెంచాలని, ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కి పెంచాలని కేంద్రాన్ని కోరారు.

ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, పార్లమెంటు సభ్యత్వ స్థాయిని యథాతథంగా ఉంచాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాటపై నిలబడాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం పిలుపునిచ్చారు. త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానా రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

Latest Videos

vuukle one pixel image
click me!