తెలంగాణలో మళ్లీ వర్షాలు షురూ..
ఇప్పటికే తెలంగాణను వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే నాలుగైదురోజులు జోరువానలు కురుస్తాయయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
నేడు (మంగళవారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, ములుగు, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగామ, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలుంటాయట... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.