తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి. రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కులపోళ్లు అంటే వెలమలకు ఎంత భూమి ఉందో తెలుసా..?
తెలంగాణలో డామినేటెడ్ కులం ఏదంటే రెడ్డిలు అనే సమాధానం వస్తుంది. నిజాంల కాలంనుండే రెడ్డిలు పెద్దపెద్ద జమిందార్లుగా, భూస్వాములుగా ఉన్నాయి... కాబట్టి ఇప్పటికే అన్నిరంగాల్లో వారి ఆధిపత్యం కనిపిస్తుంటుంది. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కులం వెలమల ఆధిపత్యం పెరిగిందనే ప్రచారం ఉంది. కేసీఆర్ అండతో వెలమదొరలు భారీగా ఆస్తిపాస్తులు సంపాదించారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఇంతకూ తెలంగాణలో కేసీఆర్ కులపోళ్లవద్ద ఎంత శాతం భూమి ఉందో తెలుసా..?
25
తెలంగాణ వెలమలకు ఎంత భూమి ఉంది..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి కులాల వారిగా ఆర్థిక, సామాజిక, విద్య వంటి కీలక వివరాలను సేకరించారు. ఈ రిపోర్ట్ ను తాజాగా ప్రభుత్వం విడుదలచేసింది. ఇందులో కులాల వారిగా ఎవరికెంత భూమి ఉంది అనే ఆసక్తికర వివరాలు కూడా ఉన్నాయి.
అయితే రాష్ట్రంలో కొన్ని కులాలవారి వద్ద అత్యధికంగా భూములు ఉన్నాయి. జనాభా శాతం కంటే భూముల శాతం ఎక్కువగా ఉన్న కులాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెలమ కులం కూడా ఉంది. రాష్ట్రంలో వెలమ జనాభా 0.4 శాతం ఉంటే వీరివద్ద 1 శాతం భూమి ఉందని కులగణన రిపోర్ట్ వెల్లడించింది.
35
తెలంగాణలో అత్యధిక భూములున్న కులాలివే...
తెలంగాణ కులగణన ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా భూములున్నది రెడ్డి కులస్తుల వద్దే. వీరి జనాభా కేవలం 4.8 శాతమే... కానీ వీరివద్ద గల భూములు ఏకంగా 13.5 శాతం. అంటే ఇంకా అత్యధికమంది రెడ్డిలు భూస్వాములుగా కొనసాగుతున్నారన్నమాట.
రెడ్డిల తర్వాత తెలంగాణలో ఎక్కువగా భూములు కలిగినది యాదవులే. రాష్ట్రంలో వీరి జనాభా 5.7 శాతం... కానీ 8.7 శాతం భూములు వీరివద్ద ఉన్నాయి. ఇక తెలంగాణలో లంబాడాల జనాభా 6.8 శాతం, వీరివద్ద భూములు 8.6 శాతం...ముదిరాజ్ లు 7.4 శాతం, వీరివద్ద భూములు 7.8... మాదిగలు 10.3 శాతం, భూములు 6.5 శాతంగా ఉన్నాయి.
తెలంగాణలో కులాల మధ్య అసమానతలను కుటుంబ సర్వే బైటపెట్టింది. రాష్ట్రంల్లో వందలాది కులాలుండగా కేవలం నాలుగైదు కులాలవద్దే 50 శాతానికి పైగా భూమి ఉందని ఈ సర్వేలో తేలింది. జనాభా ప్రకారం చూస్తే 38 శాతం ప్రజలు కలిగిన సామాజికవర్గాల వద్ద 50 శాతం... మిగతా 72 శాతం జనాభా కలిగిన కులాలవద్ద మరో 50 శాతం భూమి ఉందని కులగణన రిపోర్ట్ చెబుతోంది.
55
తెలంగాణలో అత్యధిక జనాభా బిసిలే...
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికులు బిసిలే అని ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తేలింది. రాష్ట్రంలో బిసిలు 56 శాతానికి పైగా ఉన్నట్లు తేలింది... ఇక ఎస్సీలు 17 శాతం, ఓసిలు 15 శాతం ఉన్నారు.
కులాలవారిగా చూసుకుంటే మాదిగలు 10 శాతం, షేక్ ముస్లింలు 7.9 శాతం, ముదిరాజ్ లు 7.4 శాతం, లంబాడాలు 6.8 శాతం, యాదవులు 5.7 శాతం ఉన్నారు. అత్యధికంగా భూములు, ఆస్తులు కలిగిన రెడ్డిల జనాభా తెలంగాణలో కేవలం 4.8 శాతమే.