నిజానికి వామపక్షాలతో కేసీఆర్ పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగానే ఉన్నట్లు కనిపించారు. సిపీఎం, సిపీఐ నేతలతో మధ్యవర్తుల ద్వారా చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తమ్మినేని వీరభద్రం ధ్రువీకరించారు కూడా. రెండు వామపక్షాలు చెరో ఎమ్మెల్యే సీటు, చెరో ఎమ్మెల్సీ సీటు ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. సిపిఐకి మునుగోడు, సిపిఎంకు భద్రచలం సీటు ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రతిపాదించింది. అయితే, అందుకు వామపక్షాలు అంగీకరించలేదని, మరిన్ని సీట్లు తమకు కావాలని అడిగినట్లు తెలుస్తోంది.