హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం బిఆర్ఎస్... తొలిసారి విజయం కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో నాయకులను సమన్వయం చేసుకుంటూ, అసమ్మతులను బుజ్జగించుకుంటూ, ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ, వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తూ పార్టీలు ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలో కొందరు నాయకులు టికెట్లు దక్కక బాధపడుతుంటే మరికొందరు నాయకులు టికెట్ ఇస్తామన్నా వెనక్కి తగ్గుతున్నారు. ఇలా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా సీఎం కేసీఆర్ పై ఫోటీకి జంకుతున్నట్లు తెలుస్తోంది.