బెంగళూరు : తెలంగాణకు చెందిన ప్రముఖ కార్టూనిస్టు మృత్యుంజయ్ కార్టూన్ల ప్రదర్శనను బెంగళూరుకు చెందిన ప్రముఖ కళాకారుడు, విమర్శకుడు, రచయిత సురేష్ జయరామ్ ప్రారంభించారు. సావీ మిసెస్ ఇండియా ఫోటోజెనిక్ రేణుకా కుంభం గౌరవ అతిథిగా, గ్రీన్ ఇండియా సహ వ్యవస్థాపకుడు రాఘవేంద్ర యాదవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.