తెలంగాణ ఆర్టిసి ద్వారా భద్రాచలం తలంబ్రాలు పొందడం ఎలా?
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆర్టిసి కూడా రామభక్తుల సేవకు సిద్దమయ్యింది. భద్రాచలం ఆలయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సీతారాముల ముత్యాల తలంబ్రాల పంపిణీకి సిద్దమయ్యింది. ఇందుకోసం మీరు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఆర్టిసి అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.
ఆఫ్ లైన్ లో అయితే మీరు నేరుగా దగ్గర్లోని ఆర్టిసి బస్టాండ్ కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ టిజిఆర్టిసి లాజిస్టిక్ కేంద్రంలో రూ.151 చెల్లించి మీ పేరు, ఇతర వివరాలు అందించాలి. తద్వారా రేపు సీతారాముల కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను నిర్ణీత గడువులోపు మీరు పేర్కొనే అడ్రస్ కు పంపిస్తారు.
మీరు ఆర్టిసి బస్టాండ్ కు వెళ్లకుండానే ఆఫ్ లైన్ లో భద్రాచలం తలంబ్రాల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆర్టిసి కాల్ సెంటర్ 040 23450033 లేదా 040 69440000 లేదా 040 69440099 కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీవద్దకే ఆర్టిసి మార్కెటింగ్ సిబ్బంది వచ్చి వివరాలను సేకరిస్తారు... నగదు కూడా వారికే చెల్లించి తలంబ్రాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు.
ఇక ఆన్ లైన్ లో అయితే టిజిఎస్ ఆర్టిసి వెబ్ సైట్ http://tgsrtclogistics.co.in ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి.యూపిఐ లేదా డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించి బుకింగ్ ప్రక్రియను పూర్తిచేయాలి. ఇలా కూడా సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటివద్దే ఉండి పొందవచ్చు.