హైదరాబాద్ : టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పరోక్షంగా చురకలేశారు. ఎవరూ కూడా వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ కమిట్మెంట్ ను అనుమానించాల్సిన అవసరం లేదన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే.. మాట ఇచ్చిన వాళ్ళని ప్రశ్నించి నిరూపించుకోవాలని అన్నారు. ఈ మేరకు మందకృష్ణకి పరోక్షంగా రేవంత్ రెడ్డి చురకలాంటించారు.
27
మందకృష్ణ మాదిగను ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి.. ‘బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి మీకు దేవుడు ఇచ్చిన అన్న కదా.. అతడిని ఎందుకు అడగడం లేదు’ అంటూ ప్రశ్నించారు.
37
అదే సమయంలో వర్గీకరణ విషయంలో తమ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వర్గీకరణపై స్పష్టంగా మా పార్టీ విధానాన్ని చెప్పారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
47
మీరు మద్దతు ఒకరికి ఇచ్చి…ప్రశ్నలు మరొకరికి సంధిస్తే ఎలా? అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్కు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై స్పష్టమైన విధానం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ వర్గీకరణకే కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు.
57
అయితే.. ఎస్సీ వర్గీకరణ అనేది వ్యక్తుల కోసం చేయబోమన్నారు. దామాషా ప్రకారం వర్గీకరణ ఎలా చేయాలో కాంగ్రెస్కు తెలుసు అన్నారు. ఎవరికి కూడా చిత్తశుద్ధిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు.
67
దీనిమీద పార్లమెంటులో కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంలో ఉంది బిజెపి ప్రభుత్వమే కదా.. వారి ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. మీకు మాట ఇచ్చి అమలు చేయని వారిని నిలదీసి మీ చిత్తశుద్ధి నిరూపించుకుంటే… మీకు కొంతైనా గౌరవం ఉంటుంది… అంటూ మందకృష్ణ మాదిగకు రేవంత్ రెడ్డి హితవు పలికారు.
77
తాము ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని, తమకు ఎవరి వకాల్తాలు అవసరం లేదన్నారు. తమను బెదిరించాలని చూసేవారు తాము ఎవరికి మద్దతు ఇచ్చారో వారినే అడిగితే చాలా మంచిదంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఏంటో ఎస్టీ సామాజిక వర్గానికి తెలుసని రేవంత్ రెడ్డి అన్నారు.