ఏపీలో..
ఆంధ్రప్రదేశ్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర పాల్గొన్నారు. కాగా ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరు కలిసి వేడుకలకు హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది. శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్న గవర్నర్, విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. కాగా గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జలవనరుల శాఖ, అటవీ శాఖ, రైతు సాధికార సంస్థ, వ్యవసాయ శాఖ శకటాల ప్రదర్శన జరిగింది.