ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్...
ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాలపై సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. రేపట్నుంచి ఈ ఎండలు తారాస్ధాయికి చేరతాయట. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి జిల్లాల్లో 43 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు వెదర్ మ్యాన్. అందుకే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.