అల్పపీడనం ప్రభావం ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములు ఉండే పరిస్థితి ఉన్నందున ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని సూచనలు జారీ అయ్యాయి. రాబోయే 48 గంటలు కీలకం కానున్నాయి.