Rain Alert: దూసుకొస్తున్న అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో ఉరుముల‌తో కూడిన‌ భారీ వ‌ర్షాలు, అల్లకల్లోలం ఖాయం

Published : Feb 22, 2026, 07:03 AM IST

Rain Alert: ఫిబ్రవరిలోనే ఎండలు రికార్డులు తాకుతున్న వేళ… బంగాళాఖాతం నుంచి వర్షాల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుంటే, మరోవైపు అల్పపీడనం తెలుగు రాష్ట్రాల‌కు కూల్ న్యూస్ చెప్పింది. 

PREV
15
బంగాళాఖాతంలో అల్పపీడనం

నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉండటంతో దక్షిణ భారత రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది. ఈ వ్యవస్థ ప్రభావంతో తేమ గాలులు భూభాగంలోకి చొచ్చుకువస్తాయి. దాంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మోస్తరు జల్లులు పడే పరిస్థితి ఉంది.

25
ఏపీలో ఎక్కడ వర్షాలు?

అల్పపీడనం ప్రభావం ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములు ఉండే పరిస్థితి ఉన్నందున ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని సూచనలు జారీ అయ్యాయి. రాబోయే 48 గంటలు కీలకం కానున్నాయి.

35
తెలంగాణలో మూడు రోజుల వర్ష సూచన

శ్రీలంక సముద్ర తీరానికి సమీపంగా ఉన్న వాతావరణ మార్పుల ప్రభావం తెలంగాణపై కూడా కనిపించనుంది. ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా మధ్య తెలంగాణలో ఆకాశం మేఘావృతంగా మారే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. అయితే విస్తృత స్థాయిలో భారీ వర్షాల సూచనలు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

45
హైదరాబాద్‌లో వాతావర‌ణం

ఫిబ్రవరి చివరి వారంలోనే నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్ దాకా చేరుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండ తీవ్రత కనిపించనుంది. సాయంత్రం వేళల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత కూడా అనుభూతి కావచ్చు. వర్షం పడే ప్రాంతాల్లో ఒక్కసారిగా గాలులు వేగంగా వీచే పరిస్థితి ఉండవచ్చు. బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 

55
వేస‌విలో చుక్క‌లే

ఈ ఏడాది వేసవి సాధారణం కంటే ముందుగానే ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ స్థాయికి మించి 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలులో ఇప్పటికే 36 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ విశ్లేషణల ప్రకారం ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అల్పపీడనం వల్ల వచ్చే జల్లులు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి కానీ ఆ తర్వాత ఉక్కపోత పెరగవచ్చు. ఈ వాతావ‌ర‌ణ మార్పులు ఆరోగ్యాల‌పై ప్ర‌భావం ప‌డ‌తాయ‌ని వైద్యులు చెబుతున్నారు. కాబ‌ట్టి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories