కాగా, జనసేన పార్టీ నేత, నటుడు పవన్ కల్యాణ్ గద్ధర్ పార్థివ దేహాన్ని సందర్శించారు. ఆయనను ప్రజా యోధుడు గద్దర్ అంటూ చెప్పుకొచ్చారు. కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన మాట్లాడుతూ... ప్రజా గాయకుడు గద్దర్ మరణించారంటే నమ్మశక్యం కావడం లేదు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన్ని పరామర్శించేందుకు కొద్ది రోజుల క్రితమే వెళ్ళాను. తమ్ముడా.. అంటూ ఆప్యాయంగా పలకరించి, ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పరిస్థితుల గురించీ, జాతీయ అంతర్జాతీయ విషయాలు ఎన్నింటినో మాట్లాడారు.