రుతుపవనాలు చురుగ్గా మారాయి... వీటికి బంంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి తోడయ్యింది. దీంతో తెలంగాణలో ఇవాళ(శనివారం) వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని... కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.
శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికాారులు తెలిపారు. ఇక వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.