మూసీ వరదల నుండి కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలని కేటీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేలే మూసీ పరివాహక ప్రాంత ప్రజల కోసం, హైదరాబాద్ నగరం కోసం ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చారన్నారు. కబ్జాలను తొలగిస్తే భవిష్యత్తులో మూసి పరివాహక ప్రాంతాలకు వరద ప్రమాదం తగ్గుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.