రెండోదశలో ‘ఏ’ కేటగిరిలో ఐదు ప్రధాన కారిడార్లను ప్రభుత్వం ప్రతిపాదించింది.
నాగోల్ – ఆరాంఘర్ – శంషాబాద్ విమానాశ్రయం (36.8 కి.మీ.)
రాయదుర్గం – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ – కోకాపేట నియోపోలీస్ (11.6 కి.మీ.)
ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.)
మియాపూర్ – పటాన్ చెరు (13.4 కి.మీ.)
ఎల్బీనగర్ – హయత్ నగర్ (7.1 కి.మీ.)
ఈ మార్గాలన్నీ ఇప్పటికే జనావాసాలు ఉన్న ప్రాంతాలే. మెట్రో కనెక్టివిటీ పెరిగితే అపార్ట్మెంట్ ప్రాజెక్టులు, గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించే అవకాశముంది. ముఖ్యంగా మియాపూర్, పటాన్ చెరు, హయత్ నగర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చురుకుదనం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.