తెలుగు రాష్ట్రాల్లో తొలి ట్రామా ఆక్యూట్ సర్జరీ విభాగం.. మెడికవర్ హాస్పిటల్స్ లో అత్యాధునిక వైద్యం

Published : Oct 17, 2025, 09:51 PM IST

Medicover Hospitals: తెలుగు రాష్ట్రాల్లో తొలి ట్రామా & ఆక్యూట్ సర్జరీ విభాగాన్ని మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రారంభించింది. అత్యాధునిక వైద్య సేవలను అందిస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది.

PREV
14
తెలుగు రాష్ట్రాల్లో తొలి ట్రామా విభాగం ప్రారంభం

ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్య రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా “ట్రామా & ఆక్యూట్ సర్జరీ విభాగం”ను ప్రారంభించింది. ఈ విభాగం అత్యాధునిక సదుపాయాలతో, సమన్వయ వైద్య సేవలతో, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగవంతమైన చికిత్స అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

24
పెరుగుతున్న ట్రామా కేసులు

హైదరాబాద్‌ వంటి నగరాల్లో ట్రామా కేసులు కేవలం రోడ్డు ప్రమాదాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. మెట్ల పై జారిపడటం, నిర్మాణ ప్రాంగణ ప్రమాదాలు, ఇంట్లో కార్యాలయాల్లో గాయాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం సుమారు 4.6 లక్షల రోడ్డు ప్రమాదాలు, 1.5 లక్షల మరణాలు, 3 లక్షల తీవ్రమైన గాయాలు చోటు చేసుకుంటున్నాయి. నిపుణుల ప్రకారం, వీటిలో దాదాపు 50% మరణాలు సరైన సమయానికి చికిత్స అందితే నివారించవచ్చు.

మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలోని ఈ విభాగాన్ని డా. దామోదర్ కాకుమాను, కన్సల్టెంట్ ట్రామా & ఆక్యూట్ కేర్ సర్జన్‌ నాయకత్వంలో ప్రారంభించారు. ఆయ‌న AIIMS, న్యూ ఢిల్లీ నుండి M.Ch. (Trauma Surgery & Critical Care) పట్టా పొందారు. డా. దామోదర్ మాట్లాడుతూ.. “నగరాల్లో ట్రామా కేసులు చాలా సాధారణంగా జరుగుతుంటాయి కానీ వాటిని చాలా సార్లు నిర్లక్ష్యం చేస్తారు. మొదట్లోనే గుర్తించి, వెంటనే స్పందిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు” అని తెలిపారు.

ఆయన మార్గదర్శకత్వంలో మెడికవర్ హాస్పిటల్ అత్యాధునిక ట్రామా ప్రోటోకాల్స్‌, వేగవంతమైన స్పందన వ్యవస్థలు, బహుళ వైద్య విభాగాల సమన్వయంతో రోగుల ప్రాణరక్షణలో కొత్త దిశను చూపిస్తోంది.

34
మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో 24×7 అత్యవసర సేవలు

హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ లెవల్–1 ట్రామా సెంటర్‌లో 24×7 అత్యవసర వైద్య సేవలు, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, జనరల్, ప్లాస్టిక్ సర్జరీ, క్రిటికల్ కేర్, ఫిజియోథెరపీ వంటి విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

ప్రమాదం జరిగిన క్షణం నుండి పూర్తిస్థాయి కోలుకునే వరకు రోగికి సమగ్ర సేవలు అందించే విధంగా ఈ విభాగం సేవలు అందిస్తోంది. అలాగే రోగుల శారీరక, మానసిక పునరుద్ధరణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

44
ప్రజా అవగాహన కార్యక్రమాలు

ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా, మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శ్రీచైతన్య ఐఐటీ క్యాంపస్‌, అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డా. దామోదర్ కాకుమాను, ట్రామా కేర్ బృందం విద్యార్థులు, ప్రజలకు రోడ్డు భద్రత, బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS), ప్రమాద సమయంలో చేయాల్సిన తక్షణ చర్యలు, రోగిని సురక్షితంగా ఆస్పత్రికి తరలించే పద్ధతులు గురించి వివరించారు.

ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డు భద్రత, హెల్మెట్‌ వినియోగం, సీటు బెల్ట్‌ ప్రాముఖ్యతపై సమాచార బ్రోచర్లు, వివరణలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు.

సమాజంలో ప్రమాదాలపై అవగాహన పెంచడం, అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడం లక్ష్యంగా మెడికవర్ హాస్పిటల్స్ నిరంతరం విద్యా, శిక్షణ, ప్రజా కార్యక్రమాలు చేపడుతోంది. హైటెక్ సిటీలో ప్రారంభించిన ఈ ట్రామా & ఆక్యూట్ సర్జరీ విభాగం, తెలుగు రాష్ట్రాల్లో అత్యవసర వైద్య సేవలకు కొత్త ప్రమాణంగా నిలుస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories