జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ, రెహ్మత్నగర్ డివిజన్ల ఓటింగ్ ఫలితాలు ఈ ఎన్నికల గెలుపును నిర్ణయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుమారు 1.10 లక్షల ఓట్లు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ఉపఎన్నిక ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాదరణకు, బీఆర్ఎస్ పునరాగమనానికి, బీజేపీ ఉనికి పెరుగుదలకు సూచనగా ఉండొచ్చు.
ప్రచారం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పోలింగ్ రోజుపైనే ఉంది. ప్రతి పార్టీ కార్యకర్తలు ఓటర్లను కేంద్రాలకు తరలించే ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. నవంబర్ 11న ఓటింగ్ పూర్తయ్యాక, నవంబర్ 14న ఫలితాలు వెల్లడి అవుతాయి. దీంతో ఎవరు జూబ్లీహిల్స్ గద్దెను అధిరోహిస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మక పోరుగా మారాయి. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఈ మూడు పార్టీల భవిష్యత్తు ప్రయాణం ఈ ఫలితాలపై ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.