జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత వద్ద కిలోలకొద్ది బంగారం.. దీని విలువే ఎన్నికోట్లో తెలుసా?

Published : Oct 15, 2025, 05:31 PM IST

Jubilee Hills Bypoll 2025 : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీచేసే ప్రతిపక్ష బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా? దీని విలువే కోట్లలో ఉంటుందని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.   

PREV
15
నామినేషన్ దాఖలుచేసిన మాగంటి సునీత

Jubilee Hills Bypoll : తెలంగాణ రాజకీయాలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో హీటెక్కాయి. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులకు ప్రకటించి ప్రచారజోరు పెంచాయి... ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో కాస్త ముందుందని చెప్పాలి. అభ్యర్థిని ప్రకటించడం దగ్గర్నుండి నామినేషన్ వరకు ఈ పార్టీ దూకుడుగా ముందుకు వెళుతోంది. దివంగత బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికే మరోసారి అవకాశం కల్పించారు… అతడి భార్య మాగంటి సునీత ఎన్నికల బరిలో దింపారు. తాజాగా ఆమె నామినేషన్ కూడా దాఖలుచేశారు.

25
మాగంటి కుటుంబం గురించి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్

అయితే ఇటీవల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ... మూడుసార్లు జూబ్లిహిల్స్ వంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసినా దివంగత మాగంటి గోపినాథ్ చాలా సాదారణ జీవితం గడిపారని అన్నారు. చిన్న ఇంట్లో లగ్జరీ సదుపాయాలేవీ లేకుండా మాగంటి కుటుంబం జీవిస్తోందని... ఓసారి వారి ఇంటిని చూసి ఆశ్చర్యపోయానంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో మాగంటి గోపినాథ్ ఆస్తులపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాగంటి గోపినాథ్ ప్రకటించిన ఆస్తిపాస్తుల వివరాలు చక్కర్లు కొడుతున్నాయి. 

35
మాగంటి సునీత కుటుంబ ఆస్తులెంత?

మాగంటి గోపినాథ్ 2023 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సమయంలో దాఖలుచేసిన  అఫిడవిట్ ప్రకారం... ఆయన పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.10,77,64,400 కోట్లు. ఇక ఆయన భార్య, ప్రస్తుత బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.3.41,96,400 కోట్లు. మరికొన్ని చరాస్తులు కూడా ఉన్నాయి... వీటివిలువ కూడా కోట్లలో ఉంటుందని పేర్కొన్నారు. ఇలా మాగంటి కుటుంబంవద్ద రూ.19 కోట విలువైన స్థిరచరాస్తులు ఉన్నట్లు గోపినాథ్ అఫిడవిట్ ప్రకారం తెలుస్తోంది.

45
మాగంటి కుటుంబంవద్ద ఎంత బంగారముంది?

ఆసక్తికర విషయం ఏమిటంటే మాగంటి కుటుంబంవద్ద కిలోల కొద్ది బంగారం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో చూపించారు. గోపినాథ్ వద్ద 1,760 గ్రాముల బంగారం (రూ.1,01,13,500 విలువ), 5 కిలోల వెండి (రూ.3,67,500) ఉన్నట్లు ప్రకటించారు. ఇక సునీత వద్ద 3,650 గ్రాముల బంగారం (రూ.2,06,22,500 విలువ), ఐదు కిలోల వెండి (రూ.3,67,500 విలువ) ఉన్నట్లు వెల్లడించారు.

మాగంటి దంపతులకు ముగ్గురు పిల్లలు... వారివద్ద కూడా బాగానే బంగారం ఉన్నట్లు చూపించారు. అక్షరనాగ వద్ద రూ.25,99,000 విలువచేసే 460 గ్రాముల బంగారం, వాత్సల్యనాథ్ వద్ద రూ.15,53,750 విలువచేసే 275 గ్రాముల బంగారం, దిశిర వద్ద రూ.36,16,000 విలువచేసే 640 గ్రాముల బంగారం ఉన్నట్లు మాగంటి గోపినాథ్ ఎన్నికల అపిడవిట్ లో పేర్కొన్నారు. ఇలా మాగంటి కుటుంబంవద్ద కిలోలకొద్ది బంగారం ఉంది.

55
సునీతకు కేసీఆర్ రూ.40 లక్షల చెక్

మాగంటి సునీతను జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించినప్పటినుండి కుటుంబమంతా ప్రచారాన్ని ప్రారంభించారు. సునీతతో పాటు కూతుళ్లు, కొడుకు కూడా ప్రజలవద్దకు వెళుతున్నారు. తాజాగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు కూడా కుటుంబసమేతంగా వెళ్లి బీఫామ్ అందుకున్నారు సునీత. అలాగే ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ తరపున రూ.40 లక్షల చెక్ ను కేసీఆర్ సునీతకు అందజేశారు.

ఇవాళ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మరికొందరు నాయకులతో కలిసివెళ్లి సునీత నామినేషన్ దాఖలు చేశారు. మరో సెట్ నామినేషన్ కూడా ఆమె దాఖలుచేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో ప్రధానపార్టీల తరపున మొదటి నామినేషన్ వేసి ప్రచారజోరును మరింత పెంచారు మాగంటి సునీత.

Read more Photos on
click me!

Recommended Stories