IMD Rain Alert : ఇప్పటికే భూమిపై ఓ అల్పపీడనం, బంగాళాఖాతంలో ఇంకోటి.. దీంతో మళ్ళీ వర్షబీభత్సమే

Published : Nov 01, 2025, 07:30 AM IST

Weather Update : ఇప్పటికే మొంథా తుపాను బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాాలున్నాయట. దీంతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మోత మోగించే అవకాశాలున్నాయట..

PREV
16
తెలుగు రాష్ట్రాల్లో ఇకపైనా వర్షాలే..

IMD Rain Alert : మొంథా తుపాను భారీ నుండి అతిభారీ వర్షాలు, ఈదురుగాలులతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోత మొగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది పూర్తిగా శాంతించింది... అల్పపీడనంగా బలహీనపడింది. ఇక ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దేశాన్ని వీడాయి... అంటే వర్షాకాలం ముగిసిందన్నమాట. దీంతో హమ్మయ్యా..! ఇక వర్షాలుండవు అనుకుంటున్నారా..? అయితే మీరు పొరబడినట్లే. నవంబర్, డిసెంబర్ లోనూ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

26
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

శీతాకాలం మొదలైనా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇకపై కూడా బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు ఏర్పడే అవకాశాలున్నాయని... వీటి ప్రభావంలో మధ్యమధ్యలో రెండుమూడు రోజులు వర్షాలుంటాయని హెచ్చరిస్తోంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... వాతావరణ శాఖ అందించే సమాచారాన్ని పరిశీలిస్తూ ఉండాలని సూచించింది.

36
నవంబర్ ఆరంభంలోనే వర్షాలు

అక్టోబర్ చివర్లో మొంథా తుపాను సమయంలో కురిసిన వర్షాల స్థాయిలో కాకున్నా నవంబర్ ఆరంభంలో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నవంబర్ 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ప్రకటించింది. తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా రేపట్నుండి (నవంబర్ 2) మళ్లీ వర్షాలు మొదలుకానున్నాయని... నవంబర్ 7 వరకు ఇవి కొనసాగుతాయని తెలిపారు.

46
నేడు తెలంగాణ వాతావరణం

శనివారం తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉంటుంది... పెద్దగా వర్షాలేమీ ఉండవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని ప్రకటించింది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.

నేడు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రటించారు. హైదరాబాద్ లో సాయంత్రం సమయంలో చిరుజల్లులు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని తెలిపారు. రేపు(ఆదివారం) మాత్రం హైదరాబాద్ తో పాటు వెస్ట్, సెంట్రల్ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.

56
నేడు ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం

ఇవాళ శనివారం(01-11-2025) రాష్ట్రంలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు ఈ పిడుగుల ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలుంటాయి... కాబట్టి వర్ష సమయంలో చెట్ల కింద నిలబడరాదని సూచించారు.

ఇటీవల కురిసిన వర్షాలకు నదులు, వాగులు వంకలు ఇంకా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని... జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయని విపత్తు నిర్వహణ సంస్ధ తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ప్రవాహాల వద్దకు వెళ్లరాదని సూచించింది. ముఖ్యంగా కృష్ణా, పెన్నాతో పాటు ఇతర ఉపనదుల పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.

66
తప్పిన ప్రమాదాలు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది బ్యారేజి వద్ద భారీ ప్రమాదం తప్పింది. ఇసుక సేకరణకు ఉపయోగించే మూడు పడవలు వరద ప్రవాహంలో కొట్టుకువచ్చి బ్యారేజి వైపు దూసుకువెళ్లాయి. అయితే వాటిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సమయానికి నియంత్రించడం వల్ల పెనుప్రమాదం తప్పింది.

ఇక కృష్ణా నది వరద నీటిలో ఫెర్రీ నుంచి ఓ బోటు కొట్టుకువచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు సహాయక బృందాలను రంగంలోకి దింపారు... తుమ్మలపాలెం వద్ద బోటు గుర్తించి ప్రకాశం బ్యారేజి వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గత సంవత్సరం వరదల్లో ప్రకాశం బ్యారేజి గేటులో ఓ భారీ చిక్కుకున్న విషయం తెలిసింది... దీన్ని తీయడానికి ఎనిమిది రోజులపాటు శ్రమించాల్సి వచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories