ఈ జిల్లాలకు పొంచివున్న వర్షాల ముప్పు...
ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కొనసాగనున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చే గురువారం (మే 14) వరకు, రాయలసీమ జిల్లాల్లో ఈ మంగళవారం (మే 13) వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టిఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి జిల్లా జె.కె. వీధి, ముంచింగిపుట్టు.. పోలవరం జిల్లా గుర్తేడు మండలాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది... రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.