నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురిసే జిల్లాలివే..
పశ్చిమమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో ఇవాళ (06-08-2026, గురువారం) శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు కురిసే అవకాశాలున్నాయట. ఇలా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
ఇక ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మర్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు సంస్థ పేర్కొంది. అయితే కేేవలం వర్షాలే కాదు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి చెట్లు, పోల్స్,హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని APSDMA సూచించింది. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు కాపర్లు అప్రమత్తంగా ఉండాలని... వర్ష సమయంలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.