వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రాబోయే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మేఘావృత వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ రాత్రి యాదాద్రి–భువనగిరి, రంగారెడ్డి, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అదేవిధంగా కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రాత్రివేళల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని చెప్పారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.