దిత్వా ప్రభావంతో మంగళవారం (ఈరోజు) తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే బుధవారం నుంచి పరిస్థితులు పూర్తిగా పొడిగా మారుతాయని అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు.
ఇక గడిచిన 24 గంటల్లో హనుమకొండ, నిర్మల్, ఖమ్మం, కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. హనుమకొండలోని కొండపర్తిలో 5.8 మి.మీ, ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో 3.3 మి.మీ, చర్లలో 3.0 మి.మీ, నిర్మల్ వాడ్యాల్లో 2.8 మి.మీ, బూర్గంపాడులో 2.3 మి.మీ, కామారెడ్డి మహ్మద్నగర్లో 2.1 మి.మీ వర్షం కురిసింది.