ఉన్నత స్థానంలో ఉండి ఇదేం పని?
అయితే స్మితా సబర్వాల్ తీరుపై సోషల్ మీడియాలో కూడా కొంత నెగిటివి మొదలైంది. ఐఏఎస్ లాంటి ఉన్న పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇలా ఫేక్ ఫొటోలను, ప్రజలను తప్పుదారి పట్టించే ఫొటోలను షేర్ చేయడం ఎంత వరకు సబబు? అని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం తప్పనిపిస్తే ప్రశ్నించాలి కానీ, ఇలా ఫేక్ ఫొటోలను షేర్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఫేక్ ఫొటోలను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం
ఇదిలా ఉంటే ఫేక్ ఫొటోల విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఏఐ ఫొటోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు అలాంటి వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే పలువురి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. కొంతమంది బీఆర్ఎస్ నేతలపైనా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ స్మితా సబర్వాల్కు సైతం నోటీసులు అందించారు.
ఈ ఫొటో షేర్ చేసినందుకే స్మితా సబర్వాల్కు నోటీసులు జారీ చేశారు.