కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలు ఆత్మగౌరవం కోసం వచ్చిన ఎన్నికలు కావని... కేవలం అహంకారం, ఆస్తుల పంచాయితీతో వచ్చిన ఎన్నికలని కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కమలాపూర్ మండలంలోని బత్తివానిపల్లి, గోపాలపురం గ్రామాల్లో వెంకట్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.