కరీంనగర్: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నిక హాట్ టాఫిక్. కేవలం ఒక్క ఎన్నిక కోసం టీఆర్ఎస్ సర్కార్ దళిత బంధు, కుల సంఘాల భవనాలు, నియోజవర్గ అభివృద్ది పేరిట వేలకోట్లు ఖర్చు చేస్తున్నాయి. మరోవైపు బిజెపి ప్రచారానికి కేంద్ర మంత్రులను రంగంలోకి దింపేందుకు సిద్దమయ్యింది. కాంగ్రెస్ పార్టీ తమ ఓటుబ్యాంకును కాపాడుకునే పనిలో పడింది. ఇలా అన్ని పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలోనే తమవారిని గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీ అభ్యర్ధుల కుటుంబసభ్యులు కూడా ప్రచారపర్వంలోకి దిగారు.