School Holidays: స్కూళ్లకు వరుసగా 4 రోజులు సెలవులు

Published : Aug 13, 2025, 09:47 PM IST

School Holidays: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం స్కూళ్ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

PREV
15
తెలంగాణ‌లో భారీ వర్షాలు

తెలంగాణ ప్రస్తుతం భారీ వర్షాల బీభత్సాన్ని ఎదుర్కొంటోంది. గ‌త‌వారం నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తాయి. వరంగల్, నల్గొండ జిల్లాల్లో వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. 

రహదారులు ముంపునకు గురవడం, విద్యుత్ సరఫరా అంతరాయం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. దీంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.

DID YOU KNOW ?
భారీ వర్షాలు-ఐఎండీ హెచ్చరికలు
భారీ వర్షాల సమయంలో వాతావరణ శాఖ మూడు రకాల కలర్ హెచ్చరికలు జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్-అత్యంత ప్రమాదకర పరిస్థితులు, తక్షణ జాగ్రత్తలు అవసరం. ఆరెంజ్ అలర్ట్-భారీ వర్షాలకు సిద్ధంగా ఉండాలి. ఎల్లో అలర్ట్-వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి.
25
స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో విద్యాశాఖ తక్షణ నిర్ణయం తీసుకుని మహబూబ్‌నగర్, హన్మకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి జిల్లాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెల‌వులు ప్రకటించింది. 13, 14 తేదీల్లో వర్షాల ప్రభావం కారణంగా సెలవులు ఉండగా, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న కృష్ణాష్టమి, 17న ఆదివారం ఉండటంతో మొత్తంగా గురువారం నుంచి వరుసగా నాలుగు రోజుల సెల‌వులు విద్యార్థుల‌కు ల‌భించాయి. గురువారం హైదరాబాద్‌లో మాత్రం హాఫ్ డే సెలవు మాత్రమే ప్రకటించారు. మధ్యాహ్నం తర్వాత స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాయని అధికారులు హెచ్చరించారు.

35
తెలంగాణకు రెడ్ అలర్ట్

తెలంగాణలో బుధ, గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ రెడ్ అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంటుందని చెప్పారు.

రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు గంటకు 40–50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, 17న ఉత్తర తెలంగాణలో వర్ష తీవ్రత మరింత పెరుగుతుందని తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

45
సీఎం రేవంత్ రెడ్డి కీల‌క‌ ఆదేశాలు

భారీ నంచి అతిభారీ వ‌ర్షాల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. వచ్చే 72 గంటలు అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు నిరంతర సమాచార మార్పిడి కొనసాగించాలనీ, అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్, సైన్యం సహాయాన్ని పొందేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

55
రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సమన్వయంతో రహదారులపై ట్రాఫిక్ తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నారు. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ప్రజల్లో భయాన్ని రేకెత్తించే తప్పుడు సమాచారం ప్రచారం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఈ భారీ వర్షాల ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో వర్షపాతం మరింత పెరగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories